పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు వృద్ధనేత జ్యోతిబసు ఆరోగ్యం కుదుటపడినట్టు వైద్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయనకు తాజాగా న్యూమోనియా సోకడంతో ఆయన ఆరోగ్యం మరింత విషమించిన విషయం తెల్సిందే.
దీంతో ఆయనను కోల్కతాలోని ఆస్పత్రిలో తరలించారు. ఐసీయూ వార్డులో చికిత్స చేసిన అనంతరం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్టు వైద్యులు వెల్లడించారు. అయినప్పటికీ.. మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించాల్సి వుంటుందని వైద్యులు చెప్పారు.