ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మళ్లీ చెలరేగిన అల్లర్లు: శ్రీనగర్లో కర్ఫ్యూ విధింపు! (Curfew | Srinagar | Violence | National | Police stations | Stone-pelting mob)
మళ్లీ చెలరేగిన అల్లర్లు: శ్రీనగర్లో కర్ఫ్యూ విధింపు!
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో ఎనిమిది పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. సోమవారం రాత్రి చెలరేగిన అల్లర్ల కారణంగా ఆందోళనకారులను అణిచి వేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.
ఈ కాల్పుల్లో నలుగురు యువకులు కోల్పోయారు. దీంతో అల్లరిమూకలు పెట్రేగి పోయి పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. పాత నగరంలోని రైనావారి, మహారాజ్గంజ్, సపాకదల్, ఖన్యార్, నౌహాట్టా పాటు.. మౌసుమా, బతమాలో, క్రాల్ఖుడ్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ కర్ప్యూను అమలు చేస్తున్నారు.
అంతకుముందు శ్రీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ మెహ్రాజ్ అహ్మెద్ కక్రూ మాట్లాడుతూ ఆందోళనకారుల ఉద్యమం కారణంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆంక్షలను విధించినట్టు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నామని, పరిస్థితులను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు.