జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కూడంకుళం అణు విద్యుత్ అంతా మాకే ఇవ్వాలి : జయ (Jayalalithaa Wants Power Generated From Kudankulam Only for tn)
File
FILE
తిరునెల్వేలి జిల్లా కూడంకుళంలో నిర్మించే అణు విద్యుత్ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా తమకే కేటాయించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరోమారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజీపడబోమని ఆమె ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ తొలి రియాక్టర్ ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ రియాక్టర్‌లో వచ్చే నెల నుంచి విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ట్రయల్ రన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మొత్తాన్ని తమ రాష్ట్రానికే కేటాయించాలని కేంద్రాన్ని జయలలిత కోరారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆమె లేఖ రాశారు.

గతంలో ఇదే విధంగా ఆమె పలు లేఖలను కేంద్రానికి రాశారు. అయితే, అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో తాజాగా మరో లేఖను రాశారు. మరోవైపు ఈ ప్లాంట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికంగా అనేక రకాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
సంబంధిత సమాచారం
Feedback Print