| ఇంకా చదవండి |
| ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘాటయిన వ్యాఖ్యలే చేస్తున్నారు. తెలంగాణ విమోచనోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం సాధ్యం కాదని వెల్లడించారు. అదేవిధంగా అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం కూడా కుదరదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. ఇక మంత్రి శ్రీధర్ బాబుపై ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... చట్టవిరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా, ఎంతటి పెద్దవారయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. | కేసీఆర్ను సైతం లెక్కచేయక తెలంగాణ మార్చ్ పై పట్టుబడుతున్న తెలంగాణ జేఏసీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ మంత్రి శ్రీధర్పై చేసిన వ్యాఖ్యలపై మాట తిప్పారు. తన వ్యాఖ్యలను మీడియా కత్తిరించడం వల్లే ఈ రాద్దాంతం జరుగుతోందన్నారు. తన ఉద్దేశ్యం వ్యక్తులపై దాడి కాదనీ, ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ తెచ్చుకోవడమేనని పునరుద్ఘాటించారు. |