తిరుచానూరులో జరుగుతోన్న పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. సర్వాంగసుందరంగా అలంకరించిన అమ్మవారిని రథంపై అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగించారు. రథంపై అధిష్టించి భక్తులకు అభయమిస్తూ.. మాడవీధుల్లో ఊరేగిన అమ్మవారి శోభను తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు.