ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > పంచాంగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మే 17న శని త్రయోదశి: శనీశ్వరుని అర్చించండి
శనీశ్వరుని యొక్క మహత్యం, చరిత్ర

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని మందపల్లి గ్రామం వద్ద కృతయుగంలో ఈశ్వరునికి, శనికి మధ్య సంవాదన జరిగినది. ఈశ్వరా! ఈ సాయంత్రం మిమ్మల్ని పట్టుకునేందుకు ఆజ్ఞ ఇవ్వండి అని శని కోరినాడు. ఈశ్వరుడు శని యొక్క శక్తిని పరీక్షించుటకు సరే అని తెలిపాడు. ఆ సాయంత్రం ఈశ్వరునికి శనికి దొరకకుండా ఉండేందుకు ఆలోచించి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు రావిచెట్టు వద్ద ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు. సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడు ఆహా! శని ప్రభావమునకు లోనయ్యాను.

సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి శని నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్చిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు.

శన్యారిష్టేతు సంప్రాప్తి శని పూజ్యాంచకారయేత్
శని ధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయేత్.

నీలవర్ణం నీల పుష్పం మాల్యాంభరదరం నీలఛత్రం ధ్వజ రథ పతాకచక్రం
మేరుం ప్రదక్షిణ కుర్వాణం ప్రాధ్యముఖము అవంతిదేశాధిపతిం
పత్ని పుత్ర పరివార సమేత శనీశ్వీర గ్రహం అతిదేవతా ప్రత్యత దేవతా
సమేత శనీశ్వర గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.
<< 1 | 2 | 3 
మరిన్ని
దృశ్యరూపంలో శ్రీ సర్వధారి నామ సంవత్సర రాశి ఫలాలు....
ఆర్థిక స్థితి మెరుగు...  
అవివాహితులకు సంబంధాలు...  
ఆధ్యాత్మిక చింతన...  
శ్రమకు తగిన ఫలితం....  
రుణ విముక్తులవుతారు.... శుభం