ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
 
అశ్వత్థామ ఎవరు?
Shruti Agarwal
మహాభారత కాలంలో... అంటే ద్వాపర యుగంలో అశ్వత్థామ జన్మించాడు. కౌరవులకు పాండవులకు యుద్ధ విద్యను నేర్పిన మహాగురువు. ద్రోణాచార్యుని కుమారుడు. ఈయన మామ కృపాచార్యుడు.

మహాభారత కాలంలో ద్రోణాచార్యుడు కౌరవులపక్షాన నిలిచి పాండవులతో యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుడు, అశ్వత్థామలిద్దరూ కలిసి తమ యుద్ధ నైపుణ్యంతో పాండవుల సైన్యాన్ని పెద్ద సంఖ్యలో మట్టుపెడతారు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ దీనికి అడ్డుకట్ట వేయటానికి వ్యూహరచన చేస్తాడు. దీనికోసం ఏమైనా చేయమని ధర్మరాజును అర్థిస్తాడు. వారి ప్రణాళిక ప్రకారం, యుద్ధంలో అశ్వత్థామ మరణించాడన్న పుకారును సంగ్రామ ప్రదేశంలో వ్యాపింప చేస్తారు. ఈ విషయాన్ని నిర్థారణ చేసుకునేందుకు ద్రోణాచార్యుడు ధర్మరాజు వద్దకు వెళతాడు.

ద్రోణాచార్యుని ప్రశ్నకు ధర్మరాజు బదులు ఇస్తూ... అశ్వత్థామ హతః అని ఆ తర్వాత ద్రోణునికి వినబడకుండా కుంజరః అన్నాడు. చివరి పదాన్ని గమనించని ద్రోణాచార్యుడు పుట్టెడు దుఃఖంతో కుంగిపోయాడు. పుత్రుడు మరణించాడన్న విషయాన్ని విన్నవెంటనే ఆయన అశక్తుడవుతాడు. అదే అదనుగా తీసుకుని ద్రుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని వధిస్తాడు.
 
  1 | 2  >> 
మరిన్ని
అశ్వద్ధామ ఇప్పటికీ సజీవుడై ఉన్నాడా?