హజ్రత్ ఇమామ్ తైమురి మాతో మాట్లాడుతూ “ ఈ నీటిలో స్నానం రోగులకు స్వస్థత చేకూరుస్తుంది. అప్పుడు అతను ఒక ముడిని వలలోకి మరొక ముడిని ఆమె లేదా అతని మెడకు వేస్తాడు. ముడి వేసిన అనంతరం రోగి దయ్యం ప్రభావానికి లోనై అసాధారణంగా ప్రవర్తిస్తాడని చెప్పబడి ఉంది. తరువాత ఈ ప్రాంగణంలోని కొలనులో స్నానమాచరించేందుకు రోగి పంపబడతాడు.”ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండిమురికి నీటి కొలను వద్ద జుగుప్సాకరమైన వాతావరణం మా కంటబడింది. పైపు-లైనుల ద్వారా నగరం నుంచి వచ్చిన చెత్తాచెదారం నీటిలో పడుతుండగా రోగులు అందులో స్నానం చేస్తూ కనిపించారు. సకీనా అనే అమ్మాయి మాతో మాట్లాడుతూ “ మా అమ్మకు దయ్యం పూనింది, ఆ దయ్యం నన్ను ఆవహించకూడదని ముందు జాగ్రత్తగా కొలనులో స్నానం చేస్తున్నాను.”మరికొద్ది సేపటికి “రోజా”లో హాని కలిగించుకునే సమయం ఆసన్నమైనదంటూ ఒక ప్రకటన మాకు వినిపించింది. “లోబాన్”లో పాల్గొన్న రోగులు అసాధారణ కార్యకలాపాలు సాగిస్తున్నారు. మరో పూజారి నవాబ్ సర్వర్ అలీ మా సందేహాలను నివృత్తి చేయడానికన్నట్లు మురికి నీటి స్నానం ఆరోగ్యవంతులకు హానీ కలిగించదు. ఈ ప్రక్రియలో కేవలం దుష్ట ఆత్మలు మాత్రమే బాధింపబడుతాయని అన్నారు. ఆ రోజంతా మేమక్కడే గడిపాం. ఈ ప్రాంతం పట్ల తమకు గల విశ్వాసాన్ని అనేక మంది మాతో పంచుకున్నారు. వారిలో ఒకరైన పవన్ మాతో మాట్లాడుతూ “మాకు ఈ స్థితిని బాబా సాహీబ్ ప్రసాదించారు. మేము వారికి ఎంతగానో కృతజ్ఞులమై ఉంటాము. బాధలలో ఉన్న మా బిడ్డకు వారి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాము.”మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి అక్కడున్న వారిలో 80 శాతం మంది వెనుకబడిన మరియు నిరక్షరాస్యులైన మహిళలు ఉన్నట్లు గుర్తించాము. బాబా సాహెబ్ సన్నిధిలో తాను ఆధ్యాత్మిక శాంతిని పొందుతున్నట్లు గత కొద్ది మాసాలుగా ఇక్కడే ఉంటున్న అమెరికాలో స్థిరపడిన విద్యార్థి ఇమ్రాన్ తెలిపాడు. |