మానసిక విశ్లేషకులు డాక్టర్ రమణి అధ్యయనం ప్రకారం “ ఈ ప్రక్రియ మేము మనోవైకల్యముగా నిర్దారించాము. ఈ వ్యాధి కారణంగా రోగి మతిభ్రమించినవారిలా ప్రవర్తిస్తాడు. అలాగే సైడోసిరాస్గా పిలవబడే మరో వ్యాధికి గురైన రోగి పూర్తిగా మౌనం వహిస్తాడు. ఈ వ్యాధులు చాలా సులభంగా నయమవుతాయి. వ్యాధినివారణ పట్ల దిగువ తరగతి వర్గాలకు సంపూర్ణ అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.” అన్నారు.ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండిఈ విశ్వాసానికి శ్రీకారం :జావ్రా నవాబైన నవాబ్ ఇస్మాయిల్ అలీ ఖాన్ పాలనలో ఒకే రోజున వచ్చే దసరా మరియు మొహర్రం పండుగల కారణంగా హిందు, ముస్లిం ప్రజల మధ్య గొడవలు జరుగుతుండేవి. దసరా ఉత్సవాలలో పాల్గొనాలని నవాబ్ నిర్ణయించడం ముస్లింలకు ఆగ్రహం కలిగించింది. దాంతో మొహర్రం సందర్భంగా గుమికూడేందుకు వారు నిరాకరించారు. మొహర్రం ముగిసిన మరునాడు ఆ ప్రాంతలో వజ్రాన్ని కనుగొన్న ఒక మహిళ ఆ ప్రాంతంలో ఆత్మలు దుఃఖిస్తున్నాయని నవాబ్కు తెలిపింది. తన తప్పును తెలుసుకున్న నవాబు సంతాపం ప్రకటించేందుకు జన సమూహాన్ని తిరిగి సేకరించవలసిందిగా ఆదేశించాడు. ఆ నాటినుంచి, ఈ ప్రాంతం పలు సమస్యలను నివారించే ఆధ్యాత్మిక ప్రాంతంగా పేరుగాంచింది. కర్బాలాలో వెలసిన 'రోజా'హజ్రత్ హిమామ్ హుస్సేన్ యొక్క పవిత్ర ‘రోజా’ (సమాధి) ఇరాక్లోని కర్బాలాలో కొలువై ఉంది. వారి సోదరుడు హజ్రత్ ఇమామ్ హసన్ ఇరాక్లోని కుఫ్ఫా నగరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మధ్యప్రదేశ్లోని జోవ్రాలో గల టేక్రీలోని రోజాలో హుస్సేన్ యొక్క ప్రాతినిధ్యాన్ని ఆయన అనుయాయులు విశ్వసిస్తున్నారు. వారి విశ్వాసాలను అనుసరించి ఇక్కడి రోజా దర్శనం, ఇరాక్లోని హుస్సేన్ రోజా దర్శనం తాలూకూ ప్రభావాన్ని చేకూరుస్తుంది. అందువల్లనే ఇరాక్లోని రోజా నమూనాను ఇక్కడ ప్రతిష్ఠించి అదే పేరును పెట్టారు.మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి |