విషాద సంఘటన చోటు చేసుకున్న అనంతరం పోలీసులు బాబాను అరెస్టు చేసారు. మంత్ర జలం లేదా 'సరోత'తో వ్యాధులను నయం చేస్తానని తానెప్పుడు ప్రకటించలేదని బాబా బుకాయిస్తున్నాడు. ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధుల గురించి తనకు తెలిసింది నామమాత్రమేనని అతడు అంటున్నాడు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతడు ఎంత మోసం చేసాడో?
దుర్ఘటన అనంతరం, అతడి గురించి మేము గ్రామ ప్రజలను విచారించగా, ఒక క్షేత్రంలో నిర్మితమైన తన 'ఆశ్రమం'లో యావత్ కార్యక్రమాన్ని అతడు నిర్వహిస్తాడని తెలిపారు. వైద్యానికి అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోడు కానీ ఆశ్రమానికి సమీపంలో దుకాణాలను నిర్వహించే అతని అనుచరులు పూజ సామాన్లను అధిక ధరలకు విక్రయిస్తారు.
దయచేసి అటువంటి బాబాలను నమ్మవద్దని, మూఢనమ్మకంపై అంధ విశ్వాసం ఏర్పరుచుకోవద్దని ఈ సందర్భంగా 'వెబ్దునియా' పాఠకులను కోరుకుంటున్నాము. నమ్మకానికి, మూఢనమ్మకానికి మధ్య వ్యత్యాసాన్ని తెలియపరిచే కథలను మీకు అందించేందుకు మా ప్రయత్నాలను నిరవధికంగా కొనసాగిస్తాము.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
|