భక్తులు తమ నాలుకను, రక్తాన్ని 'శక్తి'మాతకు సమర్పికుంటారు.
విశ్వాసానికి లోనైన మనిషి దాని ప్రభావంతో ఏదైనా చేస్తాడు... ఏది నిజం శీర్షికలో భాగంగా, నవరాత్రి దినాలలో శక్తిని పూజించే సమయంలో విశ్వాసం చూపే ప్రభావాన్ని మీకు పరిచయం చేస్తున్నాము... భక్తి భావనకు లోనైన భక్తులు తమ శరీరాన్ని గాయపరుచుకోవడం ద్వారా దేవతకు పూజ చేస్తారు. మరికొన్నిసార్లు అసాధారణమైన పనులకు పూనుకుంటారు.
సాధారణ దినాలలో 'శక్తి'మాతను కొలిచే భక్తుల భావోద్వేగాలు తగు మోతాదులో ఉంటాయి. అదే నవరాత్రి దినాలలో అయితే భక్తుల భావోద్వేగాలు హద్దులు దాటుతుంటాయి. మనస్సు, తనువు వారి అదుపులో ఉండవు.
మొదటగా ఇండోర్లోని దుర్గామాత దేవలయానికి మేము చేరుకున్నాము. ఇక్కడి దేవాలయ పూజారి ఒంట్లోకి దుర్గామాత వస్తుందని చెప్పుకుంటారు. దేవాలయంలో వాతావరణం చూసి మేము దిగ్భ్రాంతికి లోనయ్యాము. నోట్లో వెలుగుతున్న కర్పూరం, చేతిలో ఖడ్గంతో భక్తుల మధ్య గంతులు వేస్తున్న దేవాలయ ప్రధాన పూజారి మాకు దర్శనమిచ్చాడు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దుర్గామాత అవతారంగా భావించిన భక్తులు అతనికి పూజలు చేస్తున్నారు. అలా పూజలు చేస్తున్న వారిలో కొందరు వ్యాపారస్థులు మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అన్ని కులాలకు చెందిన భక్తులు మనకు అక్కడ కనిపిస్తుంటారు.
|