ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
 
ఆధునిక యుగంలో 'నిప్పుల యుద్ధం'
Hingots
WD
గగుర్పాటు కలిగించే గౌతమ్‌పురా సంప్రదాయ హింగోట్ యుద్ధం దివ్యకాంతుల దీపావళి పండుగను బాణసంచా ధ్వనులతో ఆనందించిన మీకు, గగుర్పాటు కలిగిస్తూ దీపావళి ఉత్సవాన్ని జరుపుకునే ఒకానొక సంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నాము. యుద్ధంతో పాటు దీపావళికి చెందిన అన్ని రకాల అంశాలను భీతి కొలిపే ఈ ఉత్సవం కలిగి ఉంటుంది. గౌతమ్‌పురాలో జరిగే 'హింగోట్' యుద్ధం గురించి మనం తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గల ఇండోర్ నగరానికి 55 కి.మీ.ల దూరంలో గౌతమ్‌పురా గ్రామం ఉన్నది.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

'హింగోట్' సంప్రదాయ క్రీడను యుద్ధ రూపంలో గౌతమ్‌పురా ప్రజలు జరుపుకుంటారు. ఈ క్రీడలో అనేకమంది గాయపడినప్పటికీ, క్రీడ పట్ల వారికి గల అభిమానం ఏ మాత్రం తరిగిపోలేదు. అడవిలోని పొదలలో పండే హింగోట్ పండ్లను ఆటకు నెలరోజుల ముందు నుంచే గ్రామీణులు సేకరించడం ప్రారంభిస్తారు. అనంతరం బోలుగా ఉండే పండ్లను మందుగుండు సామానుతో నింపుతారు. దట్టించిన పండ్లను వెదురు బద్దకు దారం, బంకమట్టితో కడతారు. దీపావళి పండుగ రెండవరోజున జరిగే అత్యంత ప్రసిద్ధి చెందిన 'హింగోట్' యుద్ధాన్ని అనుభవించేందుకు గ్రామంలోని ఆబాలగోపాలం ఎదురు చూస్తుంటారు. కళంగ, టుర్ర అనబడే రెండు సమూహాలుగా యుద్ధంలో పాల్గొనే ఆటగాళ్ళు విడిపోతారు.
like a rocket
WD


యుద్ధాన్ని పోలిన ఈ క్రీడలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు 'హింగోట్‌లు' విసురుకుంటారు. ఈ ప్రమాదకరమైన క్రీడలో ప్రతి యేటా 40 నుంచి 50 మంది ప్రజలు గాయాలపాలవుతుంటారు. అయినప్పటికీ ఈ క్రీడ పట్ల ప్రజలలో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతున్నదే కానీ తరగడంలేదు. అంతేకాక వృత్తివ్యాపకాల నిమిత్తం ఇతర ప్రాంతాలలో నివసించే గ్రామీణులు హింగోట్ యుద్ధాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా విచ్చేస్తుంటారు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి
వీడియోను వీక్షించండి
  1 | 2  >> 
చిత్రమాల
హింగోట్ నిప్పుల యుద్ధం ఫోటోగ్యాలెరీ
వెబ్ ప్రపంచం చర్చా వేదిక
నేటి ఆధునిక యుగంలో సైతం నిప్పులతో కూడిన క్రీడలను నిర్వహించటంపై మీ అభిప్రాయం?
మరిన్ని
శృతి మించిన విశ్వాసం  
ఏరులై పారుతున్న నెయ్యి
నాడీ జ్యోతిష్యం : తాళపత్రాలలో భవిష్యత్
రంగులు మార్చే శివలింగం...  
వేడి ఇనుప కడ్డీల( చాచవా)తో వ్యాధి నివారణ
అతీంద్రియ శక్తిని తలపించే.. దేవాస్ మహాకాళేశ్వరుడు