ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియనప్పటికీ, దీపావళి మరునాడు జరిగే యుద్ధక్రీడోత్సవాన్ని జరుపుకునేందుకు వేలసంఖ్యలో ప్రజలు గుమికూడుతారు. భయానకమైన సంప్రదాయ క్రీడను ప్రారంభించే ముందు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. హింగోట్లను చేబూని ఆటగాళ్ళు ఈ క్రీడలో పాల్గొంటారు. చివరి హింగోట్ విసిరేంతవరకు కూడా యుద్ధ క్రీడ కొనసాగుతూనే ఉంటుంది.
ఫోటోగ్యాలెరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
తనకు 20 సంవత్సరాల వయస్సు వచ్చిన నాటి నుంచి హింగోట్ యుద్ధంలో పాల్గొంటున్న కైలాష్, ఈ యుద్ధం గ్రామ సంప్రదాయ క్రీడగా మాతో అన్నాడు. అనేక సార్లు గాయాలపాలైనప్పటికీ, ఈ యుద్ధ క్రీడలో పాల్గొనడాన్ని కైలాష్ మానుకోలేదు. ఇక రాజేంద్ర కుమార్ అయితే నెలరోజులుగా హింగోట్ల తయారీలో తలమునకలై ఉన్నాడు. హింగోట్ల కారణంగా గత సంవత్సరం ముఖంపై ఏడు కుట్లు పడినప్పటికీ, ఈ సంవత్సరం కూడా క్రీడలో పాల్గొనేందుకు అతడు సన్నాహాలు చేసుకుంటున్నాడు.
క్రీడతో పాటు హింగోట్ల తయారీ కూడా అత్యంత ప్రమాదకరమైంది. అనుభవం లేని వారు బోలుగా ఉండే హింగోట్ పండులోకి మందుగుండును దట్టించే పనిలోకి దిగితే ప్రమాదాల బారిన పడక తప్పదు. అంతేకాక ఆటకు ముందు ఆటగాళ్ళు పూటుగా మద్యాన్ని సేవిస్తుంటారు. యుద్ధ క్రీడలో అపశృతులు దొర్లకుండా పోలీసు దళాలు, ర్యాపిడ్ యాక్షన్ బలగాలు ఇక్కడ మోహరిస్తాయి. హింగోట్ యుద్ధ క్రీడను ఉత్సవంగా భావించి నూతన వస్త్రాలను ధరించి గ్రామీణులు పాల్గొంటూ ఉంటారు, కానీ కొన్ని సార్లు ఈ ఆనందం, వారికి విషాదంగా పరిణమిస్తూ ఉంటుంది. మరి ఈ సంప్రదాయం పట్ల మీ వైఖరి ఏమిటి?
చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి
|