ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
 
'గాయ్-గౌరీ' జబువా గిరిజనోత్సవం
Cow passes over the Devotee
WD
ఈ ప్రక్రియలో అనేక మంది భక్తులు గాయపడినప్పటికీ వారిలోని ఉత్సాహం ఇసుమంతైనా తగ్గకపోవటాన్ని మేము గమనించాము. ఆవుల మంద వస్తున్నదారిలో అదేవిధమైన భక్తి ప్రపత్తులతో వారు సాష్టాంగపడతుంటారు. ఈ సంప్రదాయాన్ని పాటించే భక్తులు, తమ జీవితంలో ఎటువంటి కష్టాలను చవిచూడరని 'గోవర్ధన్ దేవాలయం' పూజారి మాతో అన్నారు.

ఈ సంప్రదాయం పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగిన గ్రామీణులు, ఆవు పాదాలను తాకడమంటే తమ మాతృమూర్తి పాదాలను తాకిన భావనను పొందుతుంటారు. గోమాత దీవెనలను అందుకునే క్రమంలో ఎటువంటి బాధలను భరించడానికైనా వారు సిద్దపడుతుంటారు. కానీ కొంత మంది తుంటరులు తమ వినోదానికై గోవుల మందలో ఎద్దులను కూడా జత చేస్తుండటంతో ఈ సంప్రదాయం భయానకమైన రూపాన్ని సంతరించుకుంటున్నది. మరికొంత మంది అత్యుత్సాహానికి పోయి గోవుల తోకలకు బాణసంచాను తగిలిస్తుంటారు.
Hundreds of People gathered
WD PhotoWD


అంతేకాక గోమాత దీవెనలకై ఎదురు చూస్తుండే గిరిజనులు మద్యం మత్తులో జోగుతుంటారు. ఈ సంప్రదాయ ఉత్సవంలో ఎటువంటి గొడవలు తలెత్తకూడదని ప్రతి సంవత్సరం పోలీసు బలగాలు ఇక్కడ నియమించబడతాయి. కానీ ఈ అంధ విశ్వాసానికి అడ్డు చెప్పడం పోలీసులకు కూడా సాధ్యం కాదు. ఈ విధమైసంప్రదాయాలను గురించి మీరేమనుకుంటున్నారు............ప్రజలు నిజంగా గోమాత దీవెనలను పొందుతుంటారా లేక ఇది ఒక గుడ్డి విశ్వాసమేనా... మీ అభిప్రాయాలను మాకు రాయండి...
వీడియోను వీక్షించండి
 << 1 | 2   
చిత్రమాల
గాయ్ గౌరి ఫోటోగ్యాలెరీ
వెబ్ ప్రపంచం చర్చా వేదిక
గాయ్ గౌరి ఉత్సవం పేరిట ఆవులమందతో తొక్కించుకోవటంపై మీ అభిప్రాయం...
మరిన్ని
ఆధునిక యుగంలో 'నిప్పుల యుద్ధం'  
శృతి మించిన విశ్వాసం  
ఏరులై పారుతున్న నెయ్యి
నాడీ జ్యోతిష్యం : తాళపత్రాలలో భవిష్యత్
రంగులు మార్చే శివలింగం...  
వేడి ఇనుప కడ్డీల( చాచవా)తో వ్యాధి నివారణ