ఈ ప్రక్రియలో అనేక మంది భక్తులు గాయపడినప్పటికీ వారిలోని ఉత్సాహం ఇసుమంతైనా తగ్గకపోవటాన్ని మేము గమనించాము. ఆవుల మంద వస్తున్నదారిలో అదేవిధమైన భక్తి ప్రపత్తులతో వారు సాష్టాంగపడతుంటారు. ఈ సంప్రదాయాన్ని పాటించే భక్తులు, తమ జీవితంలో ఎటువంటి కష్టాలను చవిచూడరని 'గోవర్ధన్ దేవాలయం' పూజారి మాతో అన్నారు.
ఈ సంప్రదాయం పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగిన గ్రామీణులు, ఆవు పాదాలను తాకడమంటే తమ మాతృమూర్తి పాదాలను తాకిన భావనను పొందుతుంటారు. గోమాత దీవెనలను అందుకునే క్రమంలో ఎటువంటి బాధలను భరించడానికైనా వారు సిద్దపడుతుంటారు. కానీ కొంత మంది తుంటరులు తమ వినోదానికై గోవుల మందలో ఎద్దులను కూడా జత చేస్తుండటంతో ఈ సంప్రదాయం భయానకమైన రూపాన్ని సంతరించుకుంటున్నది. మరికొంత మంది అత్యుత్సాహానికి పోయి గోవుల తోకలకు బాణసంచాను తగిలిస్తుంటారు.
అంతేకాక గోమాత దీవెనలకై ఎదురు చూస్తుండే గిరిజనులు మద్యం మత్తులో జోగుతుంటారు. ఈ సంప్రదాయ ఉత్సవంలో ఎటువంటి గొడవలు తలెత్తకూడదని ప్రతి సంవత్సరం పోలీసు బలగాలు ఇక్కడ నియమించబడతాయి. కానీ ఈ అంధ విశ్వాసానికి అడ్డు చెప్పడం పోలీసులకు కూడా సాధ్యం కాదు. ఈ విధమైన సంప్రదాయాలను గురించి మీరేమనుకుంటున్నారు............ప్రజలు నిజంగా గోమాత దీవెనలను పొందుతుంటారా లేక ఇది ఒక గుడ్డి విశ్వాసమేనా... మీ అభిప్రాయాలను మాకు రాయండి...
|