"మన దేశం అమాయకులతో నిండిపోయింది. దేవుడిని అని చెప్పుకునే మోసగాని వలలో పడి నేను కూడా అమాయకులలో ఒకడినైపోయాను". సత్యనామ్ విఠల్దాస్ చేతిలో మోసపోయిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సెమ్ల్యా గ్రామస్థుడైన సురేష్ బాగడీ అనే వ్యక్తి మాతో అన్న మాటలివి. రాజస్థాన్ రాష్ట్రం, బాన్సవాడ జిల్లాలోని ఛేంచ్ గ్రామానికి చెందిన మానవాతీత శక్తులు కలిగిన వ్యక్తిని గురించిన సమాచారం కొన్ని మాసాల క్రితం సురేష్ వినడంతో ఈ కథకు అంకుర్పారణ జరిగింది.
తమ గ్రామంలో పంపిణీ కాబడిన సీడీలు మరియు కరపత్రాల ఆధారంగా దేవునిగా చెప్పుకునే సత్యనామ్ విఠల్దాస్ కూరగాయల కత్తితో శస్త్రచికిత్సలు జరుపుతున్న వైనాన్ని సురేష్ తెలుసుకున్నాడు. అంతేకాక ఎయిడ్స్, క్యాన్సర్ తదితర వ్యాధులు ఉచితంగా నయం చేయబడతాయని కరపత్రం తేల్చి చెప్పింది. కానీ శస్త్రచికిత్సకు వెళ్ళిన సురేష్ తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు.
మేము కూడా ఆ సీడీని చూశాము. అందులో సత్యనామ్ దైవాంశసంభూతుడని చిత్రీకరించబడి ఉంది... అతని రక్షణ కోసం పోలీసు దుస్తులను ధరించిన వ్యక్తులు కొందరు సీడీలో మాకు కనిపించారు. అమాయకులైన గ్రామీణ ప్రజలు సులువుగా ఆకర్షితులయ్యేందుకు సర్వం సిద్దమైన తీరు మాకు అగుపించింది.
|