జ్యోతిష్య శాస్త్రంపై ప్రజలు అపారమైన విశ్వాసం ప్రదర్శిస్తుంటారు. ఏదైనా పనిని చేపట్టాలంటే శ్రేయోభిలాషుల సలహాల కన్నా తమ జాతకం పట్ల అత్యంత నమ్మకం చూపుతుంటారు. అది వివాహమైనా, వ్యాపారమైనా జాతకాన్ని సంప్రదించిన తర్వాతనే పనిని ప్రారంభిస్తుంటారు. ఇందులో నవ గ్రహాల గమనం ప్రధానమైంది. ఈ వారం ఏది నిజం శీర్షికలో వచ్చే సంవత్సరం కాలం దాకా మానవులకు శుభం చేకూర్చే ఒక ప్రత్యేకమైన ఘటనను మీకు అందిస్తున్నాం
ఈ సంవత్సరం నవంబర్ 16న గురు గ్రహ గమనం సంభవించింది. గడచిన సంవత్సర కాలంగా వృశ్చిక రాశిలో ఉన్న గురుడు ఆ రోజున ధనూరాశిలోకి ప్రవేశించాడు. ప్రాతఃకాలాన 4:24 గంటలకు ధనూరాశిలోకి గురుడు ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడుకు చెందిన ప్రజలు దేవాలయాలకు చేరుకుని తమకు అంతా శుభం జరగాలని కోరుకుంటూ గురు భగవాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
గురు భగవాన్ సన్నిధితో కూడుకున్న దేవాలయాలు తమిళనాడులో అనేకం ఉన్నప్పటికీ, పరమ శివుని గురుడు పూజించిన తంజావూర్ జిల్లాలోని ఆలంగుడిలోని ఆబాత్ సహాయేశ్వర ఆలయ క్షేత్రం, గురు గమనం రోజున అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
ఆ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి చేరుకున్నారు. గురు భగవాన్ సందర్శనార్థం భారీ వరుసలలో వారు గంటల కొద్దీ వేచి ఉండి, తమ జీవన గమనం సాఫీగా సాగాలని వేడుకున్నారు. ఇతర దేవాలయాలలో గురు భగవానుని ప్రత్యేక దర్శనాన్ని భక్తులు చేసుకున్నారు.
|