గురు గమనానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత చేకూరింది? ఈ సందేహాన్ని మా జ్యోతిష్కులైన డా. కేపీ. విద్యాధరన్ ముందు ఉంచాము. ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు. "రాశి మండంలో నాలుగు గ్రహాలకు చెందిన గమనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. తమ జాతకాలలోని నక్షత్రాలను అనుసరించి వ్యక్తులపై శని, గురు, రాహు మరియు కేతువుల గమనం ప్రభావం చూపుతుంది.
గురుని మినహాయించగా మిగిలిన మూడు గ్రహాలు వ్యక్తుల జీవితాలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. పైన పేర్కొన్న నాలుగు గ్రహాలలోను గురు గ్రహం శుభానికి సంకేతం. మన జీవితాలలో చోటు చేసుకునే వివాహం, విద్య, వ్యాపారం మరియు పదోన్నతి తదితరాలలో గురుడు సానుకూలంగా ప్రభావం చూపుతాడు. రాజకీయాలలో ఉండేవారికి అధికారం కట్టబెట్టడంలో గురు భగవాన్ ప్రభావం కీలకమైంది.
అందుకనే ప్రత్యేక రోజులలో మాత్రమే కాకుండా ఇతర దినాలలో కూడా రాజకీయ నాయకులు గురు భగవాన్ను పూజిస్తుంటారు. తదనుగుణంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అనగా రాజకీయ నేతలు, జిల్లా స్థాయి అధికారులు, వ్యాపారవేత్తలు, మరియు ధనవంతుల నుంచి ఉద్యోగుల వరకు దేవాలయాలకు విచ్చేస్తుంటారు."
|