ఈ వారం ఏది నిజం శీర్షికలో పండోఖర్ ధామానికి చెందిన గురుశరణ్ మహరాజ్ బాబాను మీకు పరిచయం చేస్తున్నాం. ఎలాంటి శారీరక వైకల్యాన్నైనా నయం చేస్తానని ఆయన నమ్మబలుకుతుంటారు. బుందేల్ఖండ్ జిల్లాలోని పండోఖర్ కుగ్రామంలో నివసించే బాబా తరుచుగా పలు ప్రాంతాలను సందర్శిస్తుంటారు.
ఇక ఆయన వైద్య శిబిరం ప్రారంభం కాగానే, వ్యాధిగ్రస్ధుల్లో ఒకరిని తన దగ్గరకు రమ్మని పిలుస్తారు. రోగిని ఏమీ అడక్కుండానే కాగితం ముక్కపై వ్యాధి లక్షణాలను రాస్తారు. ఆ కాగితాన్ని రోగికి చూపించి వ్యాధి గురించి తనకు పూర్తిగా తెలుసుననే నమ్మకాన్ని బాబా కలిగిస్తారు.
అనంతరం గంభీరమైన స్వరంతో నడవలేకపోతున్న రోగిని నడిపించే దిశగా ప్రేరేపిస్తారు. బాబా స్వరం వినిపించిన వెంటనే గబగబా నడిచే ప్రయత్నంలో నాలుగు అడుగులు వేసిన వెంటనే కిందపడిన కొందరు రోగులను మేం ప్రత్యక్షంగా చూసాం. మరేం భయపడాల్సిన అవసరం లేదని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వారి వైకల్యం నయమౌతుందని బాబా హామీ ఇస్తుంటారు.
|