ఈ పడియార్లలో ఒకరైన భవార్ సింగ్ మాతో ఇలా చెప్పాడు. గత సంవత్సరం ఇక్కడకు వచ్చి తనకు మగ బిడ్డ పుట్టాలని మొక్కుకున్నాడట. సంవత్సరం లోపే తన కోరిక నెరవేరింది కాబట్టి కొక్కీకి వేలాడటం ద్వారా అతడు మొక్కు తీర్చుకుంటున్నాడు. మేఘనాధుడికి ఇలా కృతజ్ఞత తెలుపుతున్నాడు మరి.
ఈ సంప్రదాయం చరిత్రలో ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలీదు కానీ, శతాబ్దాలుగా గిరిజనులు ఈ ఆచారాన్ని విధిగా పాటిస్తున్నారు. రావణాసురుడి పుత్రుడైన మేఘనాధుడిని వీరు తమ దైవంగా భావించి పూజిస్తుంటారు. మేఘనాథుడి పట్ల గౌరవ సూచకంగా ఈ ఆచారాన్ని వారు పాటిస్తుంటారు.
ఈ ఆచారాన్ని పాటించడానికి ముందుగా పడియార్లు ద్రాక్ష సారా సేవిస్తారు. విపరీతంగా తాగుతారు కాబట్టి కొక్కీకి వాళ్ల వీపును వేలాడదీసినా నొప్పి అనిపించదు మరి. ఈ సందర్భంగా మరొక పడియార్ అయిన పర్మార్ సింగ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తాను ఈ సాంప్రదాయాన్ని పాటిస్తుంటానని కానీ తనకు ఎప్పుడూ నొప్పి అనిపించలేదని చెప్పాడు.
ఈ ఆచారాన్ని పాటించేందుకు కొద్ది రోజులకు ముందుగా పడియార్ల వీపులపై పసుపును రాస్తారు. అయితే ఈ ఆచారాన్ని పాటిస్తున్నప్పుడు అనేకసార్లు పడియార్లు గాయపడుతుంటారు. ఒక్కోసారి వారి శరీరాలనుంచి రక్తం కారుతుంటుంది. వైద్యులు చెప్పేదాని ప్రకారం ఇది అనేక ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. అయితే ఇది తాము ఎన్నటికీ ఆపివేయకూడని సాంప్రదాయంలో భాగమని పడియార్ల విశ్వాసం. మరి, ఈ సంప్రదాయం గురించి మీరేమనుకుంటున్నారు?
|