ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాలిమా దేవిని శాంతపరిచే రక్తార్పణ
WD PhotoWD
ప్రస్తుత ఆధునిక యుగంలో రక్తార్పణ జరుగుతుందని మీరు భావిస్తారా? ద్రవిడ సంస్కృతిలో తమ ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పలు రకాల పూజలతో పాటు.. బలిదానాలు, రక్తార్పణలు చేసేవారట. ఇలాంటి కథలను చదువుతుంటే మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఈ వారం 'ఏది నిజం' శీర్షికలో అతి పురాతనమైన ఆచారాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ ఆచారం ప్రకారం పురుషులు ముళ్ళ కర్రలపై దొర్లుతూ ఇష్టదైవమైన కాలిమా దేవికి రక్తార్పణ చేసే ఉత్సవాన్ని మీరు చదవండి.

'అడవి' అనే ఈ పురాతన ఆచారం (ముళ్ళ కర్రలపై దొర్లుట) కేరళ రాష్ట్రంలోని కురంపాలా దేవి ఆలయంలో జరుగుతుంది. ఈ ఆలయం ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి వంద కిలోమీటర్ల దూరంలో వెలసి వుంది. ప్రత్యేక సంప్రదాయం పేరుతో నిర్వహించే ఈ ఉత్సవం ప్రతి ఐదేళ్ళకొకసారి జరుగుతుంది. పాదయాణిలోని తొమ్మిదో రోజున అడవి ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారంలో భక్తులు తమ రక్తాన్ని కాలిమా దేవికి అర్పించి ప్రసన్నం చేసుకుంటారు.

సంగమ కాలం నుంచి ఈ ఆచారం జరుగుతున్నట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. వేలన్ అనే పూజారి కురుంపాలా ఆలయాన్ని దాటుకుని వెళేటపుడు, ఆలయంలో కొన్ని ప్రత్యేక పూజలు చేసేవాడట. ఆ సమయంలో వేలన్‌తో ఉన్న అడవి అనే పేరుగల వ్యక్తిని ఈ ఆలయంలోని దేవత తనలో లీనం చేసుకున్నట్టు, అప్పటి నుంచి ఈ దేవతకు రక్తార్పణ చేస్తూ పూజలు చేయడం ప్రారంభించినట్టు పురాణాలు చెపుతున్నాయి.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
పాపాలు పోవాలంటే...పెళ్లాం దెబ్బలు తినాల్సిందే  
మగపిల్లవాణ్ణి కలిగించే శక్తివంతమైన మందు.. ఇదిగో...  
ఆత్మలు తిరుగాడే మన్ఫూర్ ఘాట్...  
నిప్పులపై నడిస్తే కోరినవి నెరవేరతాయట...  
గాల్ పండుగ విశిష్ట సంప్రదాయం  
బాలాపీర్ బాబా... కాలదేవుడు