ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దెయ్యాల్ని పారద్రోలే మహార్తి పూజలు
Temple
WD
దుష్టశక్తులు తరిమేందుకై కర్పూర హారతి ఇస్తున్న పళ్లాన్ని భక్తులు చేతితో విచిత్రంగా పట్టుకునే దృశ్యాన్ని మధ్యప్రదేశ్‌లోని బిజాల్‌పూర్‌‍లో ఉన్న దత్తా దేవాలయంలో చూడవచ్చు. ఈ పూజలో పాల్గొనే భక్తులను పీడిస్తున్న దుష్టశక్తులు వారిని వీడి వెళతాయనేది స్థానికుల విశ్వాసం. ఈ విచిత్రమైన పూజల గురించి తెలిసిన వెంటనే ఆ గుడిని కనీసం ఓ సారైనా దర్శించి, అక్కడి విశేషాలను తెలుసుకోవాలని బయలుదేరాం. దత్తుని గుడికి వెళ్లే ముందు అక్కడ ఓ ఎరుపు జెండా గుడిపై చాలా ఎత్తున ఎగురుతుండటం మాకు కన్పించింది. దేవాలయ ప్రాంగణంలో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఉన్నారు. సాధారణంగా శుక్రవారాల్లోనే ఈ పూజలు నిర్వహిస్తారని భక్తుల ద్వారా ముందే తెలుసుకున్నాం.
మహా హారతితో దెయ్యాలు పరార్
  దత్ మహారాజ్ ఆత్మ తనలో ప్రవేశించడం ద్వారా ఈ పూజల్లో పాల్గొనే భక్తుల బాధలను, వ్యాధులను నయం చేస్తోందని చెబుతున్నారు. మేము ఆయనతో మాట్లాడుతుండగానే మహా హారతి ప్రారంభమైంది      


భక్తులందరూ ఉమ్మడిగా ఈ హారతి ఇస్తున్నారు. దీనికోసమే వివిధ ప్రాంతాల నుంచి వారు అక్కడకు వచ్చారు. గర్భగుడిలో దత్తా స్వామి వారు సర్వాభరణ అలంకరణలతో కను విందు చేస్తున్నారు. ఏడు వందల సంవత్సరాల కిందట ఈ దేవాలయం నిర్మించబడిందని పూజారి మహేశ్ మహరాజ్ తెలిపారు. వంశపారంపర్యంగా తాము స్వామివారి సేవలో పాలు పంచుకుంటున్నామన్నారు. తాను ఏడో తరానికి చెందిన వాడినని తెలిపారు.
WD


పూర్వం తమ వంశానికి చెందిన హరినుమా సాహెబ్ 12 సంవత్సరాల కఠోర తపస్సు చేయడంతో దత్తాత్రేయ స్వామి అనుగ్రహించాడని తమ పూర్వీకుల ద్వారా తెలిసిందన్నారు. కావాల్సిన వరం కోరుకోమని స్వామి వారు సూచించగా, ఈ దేవాలయంలోనే కొలువుండాలని ఆయన కోరుకున్నాడని తెలిపారు. దీంతో అప్పటి నుంచి దత్తాత్రేయ స్వామి ఆత్మ ఈ దేవాలయంలోనే ఉంటోందని చెప్పారు.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
మహా హారతి గ్యాలెరీ
మరిన్ని
కాలిమా దేవిని శాంతపరిచే రక్తార్పణ  
పాపాలు పోవాలంటే...పెళ్లాం దెబ్బలు తినాల్సిందే  
మగపిల్లవాణ్ణి కలిగించే శక్తివంతమైన మందు.. ఇదిగో...  
ఆత్మలు తిరుగాడే మన్ఫూర్ ఘాట్...  
నిప్పులపై నడిస్తే కోరినవి నెరవేరతాయట...  
గాల్ పండుగ విశిష్ట సంప్రదాయం