ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం > వారిద్దరు కలిసి ప్రయాణిస్తే పడవ గల్లంతే..
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వారిద్దరు కలిసి ప్రయాణిస్తే పడవ గల్లంతే..
WD PhotoWD
మేనమామ... మేన అల్లుడు... ముఖ్యంగా చెల్లెలు కుమారుడు మధ్య ఉన్న సంబంధం అత్యంత ప్రేమానుబంధాలతో కూడుకొని ఉంటుంది. అయితే వీరిద్దరూ కలిసి ప్రత్యేకించి ఒక ప్రాంతంలోని నదిలో ఒకే పడవలో ప్రయాణిస్తే తప్పకుండా మునిగిపోవడం ఖాయం. ఏమిటీ ఇది నిజమా అని ఆశ్చర్యపోతున్నారా...? దీనిపై మీకేమైనా సందేహాలు ఉంటే పక్కన పెట్టండి. కాని ఇది నిజం. దీనికి నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఈ నిదర్శనాలను మా ఈ వారం 'ఏదినిజం' శీర్షికలో మీ ముందుకు తెస్తున్నాం. చదవి మీ సందేహాన్ని తీర్చుకోండి.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నర్మదా నదీ తీరాన నీమావార్ అనే ఓ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి సమీపంలో నర్మదా నదిలో ఒక భాగంలో నీరు సుడులు తిరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద సుడిగుండం. దీనినే 'నాభీ కుండం‌'గా కూడా పిలుస్తారు. ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల
WD PhotoWD
నుంచి పర్యాటకులు భారీగానే తరలి వస్తుంటారు.


ఈ దృశ్యాన్ని పడవలో పయనించి దగ్గరగా చూసి ఆనందపడుతుంటారు. అయితే మేనమామ, మేనల్లుడు ఒకే పడవను ఎక్కి చూడాలని నదిలోకి వెళ్లారంటే మాత్రం.. వారు తిరిగిరాని లోకాలకు చేరుకోవాల్సిందే. ఎందుకంటే వారు ఎక్కిన పడవ తప్పకుండా నదిలో మునిగిపోతుందట.

ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుదన్న విషయం మీకు తెల్సిందే. ఈ సమస్యకూ బ్రహ్మాండమైన పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. మేనమామ, మేనల్లుడు కలిసి ప్రయాణించదలుచుకున్నప్పుడు వారు ఓ ప్రత్యేక పూజను ఆచరించి... ఎంచక్కా ఒకే పడవలో కలిసి నదీ విహారం చేయవచ్చు.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
ఆ దేవాలయానికి మద్యపానం, సిగరెట్లే నైవేద్యం  
కొత్త జీవితాలను ప్రసాదించే రామాయణ పారాయణం  
కోరిన కోర్కెలు తీర్చే పాముల జంట  
మొండి రోగాల ఆట కట్టించే దేవత...  
దుష్టశక్తుల భరతం పట్టే చెట్టు...  
దెయ్యాల పనిపట్టే కాళీ మసీదు....