కలలు ఊహలు మాత్రమేనని, వాస్తవ జీవితానికి కలలకు ఏ సంబంధమూ లేదని సాధారణంగా చెబుతుంటారు. అయితే... ఒకే ఒక్క స్వప్నం ఒకానొక వ్యక్తి మొత్తం జీవితాన్నే మార్చివేయగలద మీరు నమ్మగలరా.. నమ్మలేరు కదూ.. అయితే చూడండి మరి.. ఇటువంటి అద్భుతం జరిగిన మధ్యప్రదేశ్లోని మనాసా అనే పేరుగల కుగ్రామానికి ఏది నిజం సీరీస్లో భాగంగా ఈ వారం మిమ్ములను తీసుకుపోతున్నాం..
మనాసా గ్రామానికి చెందిన బబిత పుట్టుకతోనే వైపరీత్యాలతో జన్మించడమే కాకుండా తన చేతులను, కాళ్లను కూడా ఆమె కదిలించలేదు. ఇతర పిల్లలతో పోలిస్తే ఆమె శరీరంలోని ఇతర భాగాలు కూడా పనిచేయకుండా ఉండేవి. తనకు తానుగా నిలబడడం, నడవడం చేయలేని బబిత జీవితమంతా పడుకునే ఉండాల్సి వచ్చింది.
యుక్తవయసు వచ్చేనాటికి ఆమె ఒకరోజు కల కనింది. ఆ కలలో ఆమెకు రాజస్థాన్లో పేరొందిన మహర్షి బాబా రామ్దేవ్జీ కనిపించారు. లేచి నిలబడు.. సహాయం అవసరమున్న ప్రజలకు సేవచేయి అని ఆయన ఆమెను ఆజ్ఞాపించారు. అంతే.. ఉన్నట్లుండి ఆమెకు కాళ్లు కొద్దిగా కదిలినట్లనిపించింది. ఆపై ఆమె జీవితం మరో దారి పట్టింది. ఇప్పుడు ఆమె తన రోజువారీ పనిని తానే చేసుకోవడమే కాకుండా వ్యాధిగ్రస్తులైన ప్రజలకు సేవ చేస్తోంది కూడా..
|