దేవుడు సైతం మొబైల్ ఉపయోగిస్తున్నాడంటే మీరు నమ్మగలరా.. ఆశ్చర్యమేస్తుంది కదూ.. మీరు ఈ విషయాన్ని నమ్మకపోతే 1200 సంవత్సరాల నాటి ఆలయానికి మిమ్ములను తీసుకెళతాం. ఇక్కడే వినాయకుడు మొబైల్ ఫోన్తో తన భక్తులను సంప్రదిస్తుంటాడు.
ఈ కాలంలో ప్రజలు ఎక్కడ చూసినా ఒత్తిళ్ల మధ్యనే బతుకుతున్నారు. కనీసం గుడికి వెళ్లేందుకు కూడా వీరికి తీరిక దొరకడం లేదు. అయితే ఇకనుంచి జనం భయపడవలసింది లేదు. ఎందుకంటే ఇండోర్లో జునా చింతామన్ గణేష్ భక్తుల వేడుకోళ్లను మొబైల్ ఫోన్లో విని వారి కోరికలు తీరుస్తుంటాడు.
జునా చింతామన్ గణేశ ఆలయానికి 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయ పూజారి చెప్పినదాని ప్రకారం, గత 22 ఏళ్లుగా భక్తులు ఈ ఆలయానికి లెక్కలేనన్ని ఉత్తరాలు పంపుతున్నారట. వీటిలో కొన్ని వేడుకోలు రూపంలో ఉంటే మరి కొన్ని కృతజ్ఞతలు తెలిపే ఉత్తరాలు.
అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్లు ప్రజల అభిమానం పొందాయి కనుక ఇక్కడి వినాయకుడికి ఉత్తరాలతో పాటు ఫోన్కాల్స్ కూడా వస్తున్నాయట. ఎవరైనా భక్తుడు కాల్ చేసినట్లయితే, ఆలయ పూజారి మొబైల్ ఫోన్ని వినాయకుడి చెవులకు సమీపంలో ఉంచుతారు. అప్పుడు భక్తులు తమ సమస్యలు, కోరుకునే పరిష్కారాల గురించి దేవుడికి విన్నవించుకుంటారు.
|