ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ సమస్యలను జునా చింతామణ్ గణేష్ నిజంగా మొబైల్ ఫోన్ ద్వారా వింటున్నాడని విశ్వసిస్తుంటారు. పైగా ఉత్తరాల రూపంలో లేదా ఫోన్ ద్వారా భక్తులు చేసే విన్నపాలను దేవుడు నెరవేరుస్తుంటాడు కూడా. ఇలా తమ కోరికలను నెరవేర్చినందుకు గాను మనీష్ మోడీ ఈ ఆలయంలోని వినాయకుడికి కృతజ్ఞతలు తెలిపాడు కూడా.
ఇక్కడి గణేషునికి భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ కాల్స్ కూడా వస్తుంటాయి. ఒకటి కంటే మించి ఎక్కువ కోరికలున్న భక్తులు వాటిని ఉత్తరాల రూపంలో పంపుతుంటారు. ఇలా ఉత్తరాల ద్వారా, మొబైల్ కాల్స్ ద్వారా వినాయకుడు తమ కోరికలను విని వాటిని నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం.
వినాయకుడు మొబైల్ ఫోన్ మరియు ఉత్తరాల ద్వారా తన భక్తులందరి కోరికలను వింటూ ఉంటాడన్న విషయాన్ని మీరు నమ్ముతారా.. లేదంటే ప్రజలను ఆకట్టుకోవడానికి ఇది ఒక వాహకంలాగా ఉపయోగపడుతోందని భావిస్తున్నారా... ఈ ఉదంతంపై మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కథనంపై దయచేసి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.
|