దాదాపు ఏడు కేజీల బరువు ఉన్న విగ్రహం నీటి మీద తేలియాడగలదా? విగ్రహం నీటిమీద తేలియాడటం లేదా మునిగిపోవడం అనే ప్రక్రియలను అనుసరించి రాబోయే సంవత్సరంలో గ్రామస్తులకు జరిగే మంచి చెడులు నిర్ణయమవుతాయా? ఏదినిజం శీర్షికలో భాగంగా ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలను కనుగొనేందుకు మాతో రండి...
మధ్యప్రదేశ్లో హాత్పిప్లియా అనే చిన్న పట్టణం ఉంది. ఇది దేవస్ జిల్లాకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరమూ నరసింహ ఆలయంలోని స్వామి విగ్రహం నీటి మీద తేలుతుంది. ఈ అద్భుతాన్ని మేం కెమెరాలో చిత్రీకరించాము.
ప్రతి సంవత్సరం డోల్ గ్యారాస్ -భాడవ మాసం 11వ రోజు ఉత్సవం సందర్భంగా నరసింహస్వామి విగ్రహానికి పూజ చేసిన తర్వాత దానిని నదీజలాల్లో వదిలిపెడతారు. ఆశ్చర్యకరంగా విగ్రహం నీటిలో తేలియాడుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తజనం ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు.
ఆయన మాతో మాట్లాడుతూ.. స్వామి విగ్రహం ఒకే ఒక్క సారి నీటిలో తేలియాడిందంటే రాబోయే సంవత్సరంలో నాలుగు నెలల పాటు సంపదలు కూడతాయని చెప్పారు. ఇలా విగ్రహం మూడుసార్లు తేలియాడిందంటే సంవత్సరం మొత్తం శుభం జరుగుతుందని జనం నమ్మకమని పూజారి చెప్పారు.
ఆ గ్రామనివాసి సోహన్లాల్ మాట్లాడుతూ, ఈ మొత్తం ఉదంతాన్ని గత 20 ఏళ్లుగా తాను చూస్తూ వస్తున్నానని చెప్పాడు. నరసింహ స్వామి విగ్రహంపై గ్రామ ప్రజలకు అపార విశ్వాసం ఉందని పేర్కొన్నాడు.
|