ఇక్కడ మరో విశేషమేమిటంటే తనను బాబా, మహరాజ్ వంటి పేర్లతో పిలిస్తే గణేష్ భాయి అస్సలు ఒప్పుకోడు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే తన చికిత్సతో ప్రజలు తమ వ్యాధులను ఎలా నయం చేసుకుంటున్నారనే విషయం కూడా తనకు తెలీదు మరి. దుర్గా దేవి ఆశీర్వాదం, అద్భుత మహిమ వల్లే ఇదంతా జరుగుతుందని అతడి విశ్వాసం.
గణేష్ భాయి భక్తులలో ఒకరు అతనికి 12 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూమిలో దుర్గామాత ఆలయాన్ని కట్టేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం అతడు భక్తులనుంచి విరాళాలను కూడా స్వీకరిస్తున్నాడు. అన్ని ఇతర వ్యాపారాల్లాగే గణేష్ భాయి వ్యాపారం కూడా జోరుగానే ఉంది. గణేష్ భాయి భక్తులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. డాక్టర్ కంటే గణేష్ భాయినే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారంటే ఆశ్చర్యపడాల్సింది లేదు.
ఈ ఉదంతంలో అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... గణేష్ భాయి నిజంగా రోగికి చికిత్స చేస్తున్నాడా? లేక స్థానిక యంత్రాంగం సహాయంతో అమాయక ప్రజలను కొల్లగొడుతూ, వారిచ్చే డబ్బులతో ఆటాడుకుంటున్నాడా? ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలుసుకోగోరుతున్నాం. ఈ కొత్త తరహా చికిత్సా విధానంపై దయచేసి మీ అభిప్రాయం మాకు వ్రాయండి... |
| సంబంధిత సమాచారం కోసం శోధించండి. | |
|