ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం > కోరికలు నెరవేరితే జంట పాముల మొక్కుబడి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కోరికలు నెరవేరితే జంట పాముల మొక్కుబడి
కోరికలు కోరుకోవడంలో మన దేశ ప్రజలకు ప్రపంచంలో ఎవరూ సాటిరారు. తమ కోరికలను తీర్చుకోవడానికి భారతీయులు ఏమైనా చేస్తారు. మధ్యప్రదేశ్‌లోని బర్హాన్‌పూర్‌లో ఉటావలి నది సమీపంలో ఉన్న నాగమందిర్ ఇలాంటి ఉదంతానికి తాజా ఉదాహరణగా నిలుస్తోంది. అనేకమంది ప్రజలు తమ కోరికలను తీర్చుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. తమ కోరికలు నెరవేరినప్పుడు ఈ మందిరానికి వారు జంటపాములను మొక్కుబడిగా ఇస్తుంటారు. వివరాల్లోకి వెళితే.....

బర్హాన్‌పూర్ పట్టణం శివార్లలో ఉటావలి నది నెలకొని ఉంది. ఈ నది సమీపంలో అద్వాల్ కుటుంబానికి చెందిన ఓ గుడి ఉంది. రుషి పంచమినాడు -గణేష్ చతుర్థి తర్వాతి రోజు- అనేక మంది ప్రజలు ఈ ఆలయానికి వస్తుంటారు. కొంతమంది కోరికలు అడగడానికి వస్తుంటే, మరి కొంతమంది కోరికలు తీరినవారు జంట పాములను మొక్కుబడిగా ఇవ్వడానికి వస్తుంటారు.

ఉద్యోగాలు కావాలని, వ్యాపారంలో లబ్ది చేకూరాలని కోరుకుంటూ ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. సంతానం కావాలని వచ్చేవారు, శారీరక, మానసిక సమస్యలు పరిష్కరించుకోవాలని వచ్చేవారితో రుషి పంచమి రోజున ఆలయం కిటకిటలాడిపోతుంది. తమ కోరికలు నెరవేరినవారు ఆ రోజున ఇక్కడికి వచ్చి ఆలయానికి జంట పాములను మొక్కుబడి కింద చెల్లిస్తారు. ఈ పాములను స్థానికంగా నివసించేవారి వద్ద భక్తులు కొనుక్కుంటూ ఉంటారు.
WD


గత 25 ఏళ్లుగా తాను ఇక్కడికి వస్తున్నట్లుగా దిలీప్ యాదవ్ అనే భక్తుడు తెలిపారు. కోరికలు నెరవేరినప్పుడల్లా ఇతను ఆలయానికి జంటపాములను నజరానాగా ఇస్తుంటారు. ఈ గుడికి వచ్చి కోరుకుంటే చాలు తమ కోరికలు అన్నీ నెరవేరుతాయని దిలీప్ యాదవ్ చెబుతారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
నాగమందిరం ఫోటో గ్యాలరీ
మరిన్ని
నల్ల శాలువా కప్పి బాదితే రోగాలు మటుమాయం  
నీటిపై తేలియాడే విగ్రహం...  
ఫోన్‌లో భక్తి.. సెల్‌లో వినాయక ముక్తి  
ముఖం చూసి మనిషిని అంచనా వేయగలమా...?!  
జీవితాన్ని మార్చిన కల....  
పునాదిలేని తంజావూరు శివాలయం