ఈ సంప్రదాయం వెనుక ఓ గాథ ఉన్నది. దానిప్రకారం ఒకానొకప్పుడు కొంతమంది సైనికులు గుర్రాలపై అడవులలో ప్రయాణిస్తూ ఉండేవారు. దారిపక్కన ముళ్లలో ఇరుక్కుపోయి బయటకు రాలేక విలవిల్లాడుతున్న పాము ఒకటి మానవ రూపం దాల్చి వారిని సాయం అడిగిందట. సైనికులు ఆ ముళ్లను తొలగించి పామును రక్షించారట. అప్పుడు తనకు సాయం చేసిన వారిని ఆ సర్పదేవత ఆశీర్వదించింది. ఈ ఆలయానికి ఎవరు వచ్చి వరాలు కోరుకున్నా అవి నెరవేరుతాయని ఆ సర్పదేవత ఆశీర్వదించిందట. అప్పటినుంచి సర్పదేవత కొలువై ఉన్న ఈ అద్వాల్ నాగమందిరాన్ని తరతరాలుగా ఆద్వాల్ కుటుంబం కాపాడుకుంటూ వస్తోంది. అందుకనే వారు నాగమంత్రి అని పిలువబడుతున్నారు. కోరికలు నెరవేర్చుకోవడానికి సుదూర ప్రాంతాలనుంచి కూడా భక్తులను రప్పించుకునే ఏకైక నాగమందిరం ఇదేనని అద్వాల్ కుటుంబానికి చెందిన అనిల్ భవసాగర్ చెప్పాడు. పూజలు, విశ్వాసాల వరకు మాత్రమే ఈ ఉదంతం పరిమితమైతే ఏ ప్రమాదమూ లేదు. అయితే నిస్సహాయ జంతువులకు హానికరంగా మారినప్పుడు ఇది తప్పుడు తంతు అవుతుంది. రిషిపంచమి ముందురోజున పాములు పట్టేవారు ఈ పాములను పట్టుకుని వాటిని దుర్భర పరిస్థితుల్లో ఉంచుతారు. అయితే విశ్వాసం, సాంప్రదాయం పేరుతో ఈ తంతును కొనసాగించడం మంచిదేనా! కేవలం విశ్వాసాలకోసం, నమ్మకాల కోసం పాములను పట్టి బంధించి, బాధించడం సమంజసమేనా.... దయచేసి ఈ ఉదంతంపై మీ అభిప్రాయాలు మాకు పంపిచండి. |
| సంబంధిత సమాచారం కోసం శోధించండి. |
|