ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం > మానవ శరీరంలో దేవత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మానవ శరీరంలో దేవత
మానవ శరీరంలో అమ్మవారి ప్రతిరూపాన్ని మీరెప్పుడైనా చూశారా...? అమ్మవారు తనలో ప్రవేశించిందిని చెప్పుకునే వ్యక్తి, కణకణలాడే నిప్పులపై నడువగలడా...? ఏదినిజం శీర్షికలో భాగంగా ఈసారి మిమ్మల్ని అటువంటి వ్యక్తుల గురించి పరిచయం చేయబోతున్నాం. వారంతా చెప్పేదేమిటంటే అమ్మవారు తన భక్తులకు సహాయపడేందుకు వారివారి శరీరాలలోకి ప్రవేశిస్తుందట.

ఈ నిజం మీకు తెలియజేయటానికి మిమ్మల్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని ఓ దేవాలయం వద్దకు తీసుకువెళుతున్నాం. ఇక్కడ కొలువై ఉన్న దుర్గాదేవి ఆలయంలో, అమ్మవారికి ప్రార్థన చేసే సమయంలో దేవి కొందరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారు ప్రవేశించిన స్త్రీలు లేదా పురుషులను టైగర్ లేదా కాల భైరవునిగా సంబోధిస్తారు. ఇలా అమ్మవారు పూనిన వ్యక్తుల ప్రవర్తన అసాధారణంగా ఉంటుంది.

వారంతా తమతోపాటు దుర్గామాతను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను దీవిస్తుంటారు. దుర్గామాత తమ శరీరాన్నంతా ఆవహించిందని భావించినవారు అమ్మవారి లీలా విశేషాలకు గుర్తుగా తమ నాలుకలపై మండుతున్న కర్పూరాన్ని ఉంచుకుంటారు. మరికొందరైతే మండుతున్న హారతి కర్పూరాన్ని తమ అరచేతులపై పెట్టుకుంటారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
తంజావూర్ సమీపంలో పవిత్ర స్మశానం  
సమస్యలు తీర్చే వానర దేవుడు  
కోరికలు నెరవేరితే జంట పాముల మొక్కుబడి  
నల్ల శాలువా కప్పి బాదితే రోగాలు మటుమాయం  
నీటిపై తేలియాడే విగ్రహం...  
ఫోన్‌లో భక్తి.. సెల్‌లో వినాయక ముక్తి