తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాలుగా పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయితే దైవభక్తిపై అత్యంత శ్రద్ధ చూపించే తమిళనాడు భక్తులు మాత్రం విభిన్న తరహాలో తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. నాలుకలు, శరీరాల్లో బాణాలు గుచ్చుకుని తమ ఇష్టదైవం సన్నిధికి పాదయాత్రగా వెళుతుంటారు. అలాగే తలపై కొబ్బరి కాయలు పగులకొట్టించుకుంటారు.
ఇలా విభిన్న తరహాలో వారికి తోచిన రీతిలో భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంటారు. తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లోని భక్తులు తలపై కొబ్బరి కాయను పగులకొట్టితే తమ కోర్కె నెరవేరుతుందనే మూఢ నమ్మకం బలంగా ఉంది.
ఇందుకోసం వారం పది రోజుల పాటు వ్రతం చేస్తారు. ఆ తర్వాత ఆలయ పూజారి చేత తలపై కొబ్బరి కాయను పగుల కొట్టించుకుంటారు. కొన్ని సందర్భాల్లో పలువురి భక్తుల తలలు కూడా పగిలాయి. అయినప్పటికీ భక్తులు మాత్రం వెనుకంజ వేయటం లేదు.
|