ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > వడ్డికాసులవాడా... చూడవయా ఈ వడ్డింపులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వడ్డికాసులవాడా... చూడవయా ఈ వడ్డింపులు
FILE
కలియుగ దైవ దర్శనం అనంతరం ప్రతి ఒక్కరూ దర్శించే పుణ్యక్షేత్రం తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దేవాలయం. అయితే అమ్మవారి దర్శనం కోసం వాహనాల్లో వెళితే జేబులు గుల్లవడం ఖాయం. ఎందుకంటే వాహనాలలో వచ్చే భక్తులు తమ వాహనానికి పార్కింగ్ ఫీజు రూపేణా అక్కడి కాంట్రాక్టర్లు నియమించినవారికి రుసుము చెల్లించాలి.

ఇలా వసూలు చేసే హక్కు తితిదే కల్పించింది మరి. ఇందుకు గాను కాంట్రాక్టర్ల వద్ద ఏడాదికి కోటిన్నర రూపాయలను వసూలు చేస్తోంది. కనుక తాము వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేయక తప్పదంటున్నారు సదరు కాంట్రాక్టర్లు.

చిన్న వాహనాలకైతే 30 రూపాయలు వడ్డన. పెద్ద వాహనాలకు రూ.50, బస్సులకైతే ఏకంగా వంద నోటు ఇచ్చుకోవాల్సిందే. దీంతో బెంబేలెత్తుతున్న భక్తులు తమ వాహనాలను దేవాలయానికి దూరంగా పార్కింగ్ చేస్తున్నారు. అలా దూరంగా ఉన్న వాహనాలను కాంట్రాక్టర్లు వదులుతారా...? అక్కడికీ వెళ్లి రుసుము చెల్లించాల్సిందేనని భక్తులను వేధిస్తున్నారు. బలవంతపు వసూళ్లకు తెగబడుతున్నారు. ఏడు కొండలవాడా... ఏమిటయ్యా భక్తుల "వాహన" కష్టాలు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
కఠోర నిత్య సాధన.. వేద పారాయణం  
విభీషణుడి ఔదార్యం
ఏ దిశలో కూర్చుని భుజించాలి?
విభిన్నంగా మొక్కులు తీర్చుకునే భక్తులు  
అభ్యంగన స్నానాలు ఎప్పుడు చేయాలి?
బొజ్జ రాయుళ్ల ఫుట్‌బాల్ గేమ్