|
ఏడాదిలో వచ్చే అన్ని మాసాలకంటే కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. వ్రతాలకు, నోములకు ఉపవాసాలకు ఇత్యాది శుభకార్యాలకు ఈ మాసం పెట్టిందిపేరు. కార్తీకమాసంలో చేసే నదీ స్నానాలకు విశిష్టత ఉన్నది. సకల శుభాలు, సుఖ సంతోషాలు ఆ సర్వేశ్వరుడు ఒసగాలని భక్తులు కోరుకుంటారు. ఇందులో భాగంగా నదులలో, సముద్రాలలో పుణ్య స్నానాలను ఆచరిస్తారు.
నదులలోని నీరు ఉదయం సూర్యరశ్మి వల్ల వేడెక్కి రాత్రి సమయంలో పూర్ణ చంద్రుని వెన్నెలతో చల్లబడుతుంది. ఇదే కాకుండా అడవులలోని ఔషధ మొక్కలు నదీ ప్రవాహంలో కలవడం వల్ల నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అందుచేత ఈ మాసంలో నదీ స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
|