నేడు (శుక్రవారం) ప్రదోషం. పరమేశ్వరునికి ప్రీతికరమైన ఈ రోజున ప్రదోష కాలంలో లక్ష్మీపూజ చేయడం ఐశ్వర్యప్రదమని పండితులు అంటున్నారు. శుక్రవారం పూట వచ్చే ప్రదోషానికి మహిమ ఎక్కువని, ఈ రోజున ముత్తైదువులు, కన్యలు దీపాలను వెలిగించి, లక్ష్మీనారాయణ స్మరణ చేయాలి. అంతేగాకుండా ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం.అందుచేత శుక్రవారం వచ్చే ప్రదోష కాలంలో శుచిగా స్నానమాచరించి, ఉపవాసముండి పరమేశ్వరుని దర్శించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. |