బెంగాల్ ప్రాంతంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన మహాభక్తుడు చైతన్య మహాప్రభు. 16వ శతాబ్దంలో బెంగాల్లో చైతన్య మహాప్రభు సంఘ సంస్కరణలు చేపట్టి సమాజాన్ని ముందుకు నడిపించాడు. హరే కృష్ణ మంత్రంతో ప్రజలను ద్వారకాదీశుడు వైపు నడిపించిన మహా భక్తుడు చైతన్య మహాప్రభు.
చైతన్య మహాప్రభు 1486లో జన్మించాడు. చైతన్యుడి అసలు పేరు చైతన్య చరితమ్రిత. చైతన్యుడి కుటుంబం ఒరిస్సా నుంచి బెంగాల్కు వలస వచ్చింది. చైతన్యుడు చిన్ననాటి నుంచే చదువులో ముందుండేవాడు. యుక్త వయస్సు నుంచే శ్రీకృష్ణుడిని స్మరించటంతో పాటుగా పాటలు పాడుతూ పులకరించిపోయేవాడు చైతన్యుడు.
సంస్కృత భాషలో ప్రావీణ్యం సంపాదించాడు చైతన్యుడు. తన తండ్రికి శ్రాద్ధ కర్మలు నిర్వహించటానికి ఫల్గు నది ఒడ్డున గల గయకు చేరుకున్నప్పుడు గురు ఈశ్వర పురిని కలిశాడు. ఇదే చైతన్యుడి జీవితాన్ని మలుపుతిప్పింది. అక్కడి నుంచి వైష్ణవ మత ప్రచారంలో చైతన్యుడు నిమగ్నమైనాడు.
|