|
భక్తులకు తమ ఇష్ట దైవాలు వివిధ రూపాలలో దర్శనమిస్తుంటారు. ఆ దైవాలను తమకు తోచినట్లు మలుచుకుని పూజలుకావిస్తుంటారు భక్తులు. దసరా ఉత్సవాల్లో భాగంగా గుంటూరులో ద్వారకామయి దేవాలయంలో సాయినాధుని 2 వేల కొబ్బరికాయలతో సుమారు 18 అడుగుల ఎత్తులో రూపొందించారు. నారికేళ సాయినాధుని దీవెనలు అందుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించేందుకు తాము ఈ సాయినాధుని రూపొందించామని ఆలయ నిర్వాహణ అధికారులు వెల్లడించారు. చీరాల కళాకారులు ఎంతో నైపుణ్యంతో సాయినాధుని రూపాన్ని మలిచారన్నారు.
|