తిరుమల ఆనందనిలయంలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని ప్రతి భక్తుడు వీక్షించగలిగేది 3 సెకన్లు మాత్రమే. ఆ కొద్దిసేపైనా... దివ్య మంగళ స్వరూపుని సందర్శన భాగ్యం కలిగినందుకు తరిస్తారు భక్తులు. అయితే నిత్యం కోనేటి రాయనికి జరుగుతున్న సేవల పేర్లను వినడమే కానీ, ఆ సేవలు ఎలా జరుపుతారో భక్తులకు తెలియదు. ఆ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకింపజేసేందుకు టిటిడి పూనుకుంది. ఇందులో భాగంగా శ్రీవారి ప్రతి రూపాన్ని కోటిన్నర రూపాయల వ్యయంతో తీర్చిదిద్దింది. వేంకటేశుని రూపానికి సరిపోయే విధంగా విగ్రహ రూపాన్ని మలచేందుకు ఆర్ట్ డైరెక్టర్ మణికి ఆయా సమయాల్లో 5 రోజులపాటు ప్రత్యేక సమయం కేటాయించారు. భక్తి చానల్ కోసం మణి రూపొందించిన ఈ వేంకటేశుని ప్రతిరూపం సందర్శనకు భక్తులను, టూరిస్టులను అనుమతిస్తామని టిటిడి ఇవో శ్రీ కె.వి రమణాచారి పేర్కొన్నారు.
|
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
|