|
శబమరిలాధీశుని దర్శనంకోసం నెలల తరబడి కఠోర దీక్షలు చేసి శబరిమల యాత్రను చేస్తుంటారు భక్తులు. అయితే శబరిమల యాత్ర చేయలేని మరియు ఆర్థిక స్తోమతలేని భక్తులకోసం ప్రత్యేకంగా విశాఖపట్టణంలో అచ్చు శబరిగిరీశుని ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించారు.
చెన్నై నుంచి ప్రత్యేకంగా 60 మంది కార్మికులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. కాగా దేవాలయ నిర్మాణానికి సుమారు 50 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేశారు. శబరిమల అయ్యప్పకు జరిగే అన్ని పూజా కార్యక్రమాలు ఈ దేవాలయంలోనూ నిర్వహిస్తామని ఆలయ అధికారులు చెపుతున్నారు.
|