తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీవారి ఆలయంలోని శాసనాలను సిడిలుగా రూపొందించిన తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది.
స్వామివారి ఆలయంలోనున్న పురాతన శాసనాలను సిడిలుగా రూపొందించామని, వీటిని అన్ని భాషల్లోను అలాగే ఇంటర్నెట్లోన పొందుపరిచామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ ఆదికేశవులు నాయుడు శుక్రవారం చెప్పారు.
రానున్న వైకుంఠ ఏకాదశి రోజున వృద్ధులకు, చంటి పిల్లల తల్లులకు, వికలాంగులకు మహాద్వార ప్రవేశం రద్దు చేసామని ఆయన తెలిపారు.