భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామికి స్వర్ణ ధనుర్భాణాలను గురువారం ఓ భక్తుడు సమర్పించారు. భద్రాచలం ఆర్టీసీ డిపోలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సిహెచ్ మోహన్రావు దంపతులు ఈ ధనుర్భాణాలను దేవస్థానం ప్రధాన అర్చకులు కోటి రామకృష్ణమాచార్యులు, పొడిచేటి రామచంద్రాచార్యులకు అందించారు.
తర్వాత ఆలయ ప్రధానార్చకులు ధనుర్భాణాలకు సంప్రోక్షణ నిర్వహించి మూలవిరాట్లకు వీటిని ధరింపజేశారు. ఈ సందర్భంగా మోహన్రావు దంపతులు మాట్లాడుతూ, స్వామి వారికి ఈ ఆభరణాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వీటి విలువ కనీసం రూ.40 వేల దాకా ఉంటుందని అన్నారు.
|