తిరుమలలోని స్వామివారికి గురువారం కొంత మంది భక్తులు భారీమొత్తంలో విరాళాలు అందించారు. చెన్నైకి చెందిన ఓ భక్తుడు రూ.25 లక్షల మొత్తాన్ని స్వామి వారికి సమర్పించుకున్నారు. భక్తుని కోరిక మేరకు ఈ విరాళాన్ని గోసంరక్షణ ట్రస్టుకు కేటాయించారు.
కాగా, ప్రాణదానం ట్రస్టుకు ఢిల్లీకి చెందిన భక్తులు రూ.10 లక్షలు, చెన్నైకి చెందిన భక్తులు రూ.10 లక్షలు, సికింద్రాబాద్కు చెందిన భక్తులు రూ.5 లక్షల చొప్పున సమర్పించుకున్నారు. విరాళాలు సమర్పించుకున్న వీరిని ధర్మారెడ్డి అభినందించారు. ఆయన మాట్లాడుతూ, స్వామివారికి భక్తులు ఈ తరహాలోనే విరాళాలు ఇస్తుంటారని అన్నారు.
|