ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > తిరుమలలో టిటిడీ ఛైర్మన్ తనిఖీలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తిరుమలలో టిటిడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమలలో టిటిడీ ఛైర్మన్ ఆదికేశవులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. టిటిడీ ఈవో కె.వి.రమణారి, ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డిలతో కలసి ఆయన పలు ప్రాంతాల్లో తనిఖీ చేశారు.

బాలాజీనగర్‌లో కౌస్తుభం పేరుతో నిర్మిస్తున్న అతిధి గృహాలను పరిశీలించారు. ఈ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాల పేరుతో చెట్లను నరకడం కంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన కోరారు.

తర్వాక హెచ్‌వీసీ, ఎస్‌ఎస్‌సీ, మాధవ నిలయంలోని భక్తులతో కాసేపు మాట్లాడారు. టిటిడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని
తిరుమల శ్రీవారికి అధికమొత్తంలో విరాళాలు
రాజధానిలో 'చవితి సందడి'  
దుర్గగుడిలో తాపడం పనులు పునఃప్రారంభం
తిరుమల పవిత్రతను పరిరక్షిస్తా: డీకే
కంచిలో ముగిసిన శత చండీ యాగం
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయానికి పసిడి వన్నెలు