భద్రాచలం శ్రీసీతారామచంద్ర దేవస్థానం ప్రాంగణంలో శ్రీ గోకులం పూజలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా శ్రీగోకులాలను ఏర్పాటు చేయాలన్న దేవదాయ శాఖ నిర్ణయం మేరకు భద్రాచలంలో దేవస్థానం ఈవో రాఘవాచార్యులు పూజలను చేపట్టారు.
ఇందులో భాగంగా గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోశాలలోకి పంపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు స్తలశాయి, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. హిందూ సంప్రదాయంలో భాగమైన గోపూజ చేయడం ద్వారా కోరుకున్నవన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
|