తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి బంగారు కాసుల హారం కానుకగా అందింది. చెన్నైకు చెందిన ఓ భక్తుడు బంగారు లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారి సమక్షంలో టీటీడీ ఛైర్మన్ డి. ఆదికేశవులు నాయుడుకి అందించారు.
అమ్మవారి మూల విగ్రహాలకు అలంకరించేందు కోసం ఈ హారాన్ని సమర్పించుకున్నట్టు ఆ భక్తుడు తెలిపారు. సుమారు 250 గ్రాముల బంగారంతో ఈ కాసుల హారం తయారయిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ లక్ష్మీకాసుల విలువ దాదాపు రూ.2.50 లక్షల రూపాయలు ఉండవచ్చని వారు అంచనావేశారు.
|