ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > వరసిద్ధి వినాయకుడికి వజ్రాల నామాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వరసిద్ధి వినాయకుడికి వజ్రాల నామాలు
కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయకుడికి భక్తులు వజ్రాలు పొదిగిన బంగారు నామాలను సమర్పించుకున్నారు. నెల్లూరుకు చెందిన రామకృష్ణారెడ్డి, పద్మజలు సుమారు 219 గ్రాముల బంగారంతో ఈ నామాలను తయారు చేయించి స్వామివారికి బహుకరించారు.

ఆలయ ఈవో రాజశేఖర్‌కు దాతలు ఆదివారం ఈ నామాలను సమర్పించుకున్నారు. ఈ నామాలను స్వామివారికి నిత్యం అలకరించనున్నామని ఆలయ వర్గాలు తెలిపాయి. వీటి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉండగలదని అధికారులు అంచనా వేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్, పాలకమండలి సభ్యులు ప్రవీణ్, రామ్మూర్తినాయుడు, మునిరత్నంరెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని
అమ్మవారికి బంగారు కాసుల హారం
చెన్నైకు 30 వేల శ్రీవారి లడ్డూల సరఫరా
వినాయక చవితి ఉత్సవాల భద్రతపై సీఎం సమీక్ష
భద్రాద్రిలో ప్రారంభమయిన శ్రీగోకులం
తిరుమలలో టిటిడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమల శ్రీవారికి అధికమొత్తంలో విరాళాలు