కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం రత్నగిరి కొండపై వెలసిన నరసింహస్వామి వారి జాతర వైభవంగా ముగిసింది. శ్రావణ మాసం చివరి రోజున స్వామి వారి ఆలయంలో ప్రత్యేక జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కొండపైన సొరంగం మార్గం ద్వారా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కొండ శిఖర భాగంలో భక్తులు దీపారాధన చేసి, నైవేధ్యాలు సమర్పించుకున్నారు. కొంత మంది భక్తులు స్వామి వారి పేరుతో అన్నదానం చేశారు.
ఈ ఉత్సవాలకు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి సుమారు 30 వేలమంది భక్తులు హాజరయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి.
|