తితిదే పాలకమండలి సభ్యులుగా మరో ఇద్దరు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో పెన్మత్స సాంబశివరాజు, అంజయ్యచే తితిదే ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు.
తర్వాత వీరు స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీరంగనాయక మండపంలో ఈ ఇద్దరు సభ్యులను వేద పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు, పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
|