అక్టోబర్ 1 నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తితిదే ఛైర్మన్ డి.కె.ఆదికేశవులు నాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్, దేవదాయశాఖ మంత్రులను ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్, దేవదాయశాఖ మంత్రి రత్నాకరరావు, గవర్నర్ తివారీలకు ఆదికేశవులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించగా, ఆయన వచ్చేందుకు అంగీకరించారని చెప్పారు.
అవసరమైన ప్రాంతాల్లో దళిత గోవిందం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని కూడా కొనసాగించనున్నట్టు తెలిపారు.
|