అక్టోబర్లో జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గద్వాల పంచెలు సిద్ధమవుతున్నాయి. ఎరవాడ జోడు కలిగిన ఈ గద్వాల పంచెలను మొదటి శుక్రవారం, విజయ దశమి రోడున స్వామి వారికి ధరింపచేస్తారని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గద్వాల సంస్థానాధీశులైన రాజు సీతారాంభూపాల్ తన వంశస్థుల ఇష్టదైవమైన శ్రీనివాసునికి పంచెలను సమర్పించే ఆనవాయితిని తొలిసారిగా ప్రారంభించారు. ఈ పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల అంచు, ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి.
|