కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడికి బంగారు రథం తయారు చేసే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం సానుకూలంగా స్పందించింది. ఈ అంశానికి సంబంధించి గతంలో కాణిపాకం పాలక మండలి తితిదేని కలిసి చర్చించింది.
స్వామి వారి బంగారు రథం కోసం సుమారు రూ.4 కోట్ల 50 లక్షలు ఖర్చు అవుతుందని అధికారా వేశారు. తితిదే పాలక మండలి కొత్త ఛైర్మన్గా ఆదికేశవులు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనను కాణిపాకం పాలక మండలి కలిసి చర్చలు జరిపింది.
వెంటనే స్పందించిన ఆదికేశవులు రథం కోసం కేటాయించిన నగదు, బంగారం, వెండి తదితరాలను తితిదేకు అప్పగిస్తే ఆరు నెలల కాలంలో రథాన్ని తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
|